🏠 www.manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 03:56 PM Posted by: admin

దుండిగల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది

దుండిగల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది

దుండిగల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ ఖాజా మియా, ఉపాధ్యక్షుడిగా సురేష్, ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా బషీర్, చీఫ్ అడ్వైజర్‌గా సల్లంగుల మల్లేష్, జాయింట్ అడ్వైజర్‌గా శ్రీనివాస్ సాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్. డేవిడ్, ఖజాంచిగా గిరి, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఆరిఫ్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దుండిగల్ ప్రాంతంలోని కాంట్రాక్టర్ల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం, అసోసియేషన్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. సభ్యులందరి సహకారంతో అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.
🏠 Home