🏠 www.manchitanamjournalist.online
Watermark
Newspaper Logo
Date of Publish: 02 August 2026, 03:47 PM Posted by: admin

చిన్నారి ప్రాణాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

చిన్నారి ప్రాణాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
* ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.5 లక్షల ఎల్వోసి అందజేత

మంచితనం జర్నలిస్ట్, శామీర్ పేట్ :
ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతనిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి అన్నారు. శామీర్ ‌పేట్ డివిజన్‌ నర్ల బాబు కుమార్తె తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతు ఆర్థిక సహాయం నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరి అయిన రూ. 5 లక్షల సీఎం ఎల్‌ఓసీ పత్రాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మానవత్వానికి పెద్దపీట వేస్తూ ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని అన్నారు.
🏠 Home